- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులో భాగంగా పెండ్లిపాకల రిజర్వాయర్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.20.43 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. అక్కినపల్లి గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పనులు, ఇది వరకే కాంట్రాక్టర్ పూర్తి చేసిన పనులకు, మిగిలిన నిర్మాణ పనులకు తాజా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతించారు.
- Advertisement -