నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అన్నదాతల ఖాతాల్లో రైతుభరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఐదు ఎకరాల వరకు ఉన్న 4.43లక్షల వేల మంది రైతులకు రూ.6,404 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19.82 లక్షల ఎకరాలకు రూ.1,189.43 కోట్లు గురువారం జమ చేసినట్టు చెప్పారు. తొమ్మిది రోజుల్లో అర్హులైన రైతులందరికీ రైతుభరోసా ఇచ్చే లక్ష్యంతో నిధులు విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 62 లక్షలా 47వేల మంది రైతులకు కోటి ఆరు లక్షల ఎకరాలకు రూ.6,404 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సాయం అందిస్తామని తెలిపారు.
ఐదెకరాలకు రూ.6,404 కోట్లు జమ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES