– పెద్దవూర మండలంలో ఘటన
నవతెలంగాణ-పెద్దవూర
రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు ఇరుకు రోడ్లతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్లో శుక్రవారం స్కూటీని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో టైర్ల కింద పడి పసికందు నుజ్జునుజ్జు అయిన ఘటన మరువకముందే …తాజాగా శనివారం బైక్ను ఆర్టీసీ బస్సు ఢ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయినవానికుంట గ్రామానికి చెందిన మేకల శంకరయ్య(40) మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో గ్రామం స్టేజీ పక్కన వైన్స్షాపు వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో నాగార్జునసాగర్ నుంచి పెద్దవూర వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైకును ఢకొీట్టింది. దీంతో శంకరయ్య మృతదేహం నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని నాగార్జునసాగర్ కమలా నెహ్రు ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అతని భార్య సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.
బైక్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES