- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఉక్రెయిన్పై భారీ స్థాయిలో అటాక్ చేసింది రష్యా. సుమారు వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఇటీవల కాలంలో రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదే. గడిచిన 24 గంటల్లో సుమారు వెయ్యి డ్రోన్లతో రష్యా అటాక్ చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. పగటిపూటే దాదాపు 550 డ్రోన్లను ఫైర్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ దాడుల వల్ల సుమారు 40 మంది గాయపడ్డారు. దీంట్లో అయిదుగురు చిన్నారులు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
- Advertisement -



