Friday, May 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంజూన్‌ 2న ఉక్రెయిన్‌తో తదుపరి దఫా చర్చలు ప్రతిపాదించిన రష్యా

జూన్‌ 2న ఉక్రెయిన్‌తో తదుపరి దఫా చర్చలు ప్రతిపాదించిన రష్యా

- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్‌తో తదుపరి దఫా శాంతి చర్చలు జూన్‌ 2న ఇస్తాంబుల్‌లో జరుగుతాయని రష్యా ప్రతిపాదించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ ఒక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో తదుపరి చర్చలు వాటికన్‌ లేదా జెనీవా వేదికగా జరగవచ్చంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో గతంలో చర్చలు జరిగిన ఇస్తాంబుల్‌కే రష్యా ప్రాధాన్యతనిచ్చింది. ఈ సందర్భంగా పుతిన్‌ సహాయకులు వ్లాదిమిర్‌ మెదిన్‌స్కీ నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందం, సమస్య పరిష్కారానికి సంబంధించిన మెమోరాండంను ఉక్రెయిన్‌కు అందించడానికి సిద్ధంగా వున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఉద్రిక్తతలకు మూలాలను కనుగొని వాటిని పరిష్కరించుకోవడంపై తమ వైఖరిని వివరిస్తూ రష్యా ఈ మెమోరాండంను రూపొందించిందని లావ్‌రోవ్‌ తెలిపారు. ముందుగా అంగీకరించిన విధంగా రష్యా సకాలంలో సంబంధిత మెమోరాండాన్ని రూపొందించిందని, అందులో తమ వివరణ అంతా తెలియచేశామని చెప్పారు. ఇరు పక్షాలు వెయ్యి మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకునేందుకు, కాల్పుల విరమణ కోసం తమ డిమాండ్లతో కూడిన మెమోరాండం సిద్ధం చేయడానికి అంగీకరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -