విజయ్ సేతుపతితో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్ చిత్రీకరణను ప్రారంభించనున్నారు. హై-ఆక్టేన్ కథలకు పాపులరైన పూరి, తన సిగేచర్ మాస్, కమర్షియల్ స్టయిల్ని విజయ్ సేతుపతి మాగెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో బ్లెండ్ చేసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తారు. అన్ని ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలు పూర్తయ్యాయి. ఈ సినిమాలోని కీలక నటీనటులను నిర్మాతలు ఒకరి తర్వాత ఒకరిని అనౌన్స్ చేస్తున్నారు. టబు, దునియా విజరు కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు, సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. సంయుక్త పాత్ర కథనంలో కీలకంగా ఉంటుంది. ఎమోషనల్ డెప్త్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే పాత్రలో కనిపించబోతున్నారు. కథ, ఆమె పాత్రతో సంయుక్త చాలా థ్రిల్ అయ్యింది. చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి ఆమె ఆసక్తిగా ఉంది అని మేకర్స్ తెలిపారు. ‘వైవిధ్య కథతో తెరకెక్కబోయే ఈ సినిమాలో విజరుసేతుపతి, సంయుక్త పాత్రలు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. ఫస్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్లను ఖరారు చేయడానికి టీం ఇటీవల హైదరా బాద్, చెన్నైలలో రెక్కీని పూర్తి చేసింది. ఈనెల చివరి వారంలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది. విజరు సేతుపతి, సంయుక్త, టబు, విజరు కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్, నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మి కౌర్, సిఈవో: విషు రెడ్డి.