- Advertisement -
– ఎంపీ ఓ పద్మ
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని నైనాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా యాసం సంధ్య రమేష్ రమేష్ తో పాటు ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడు మరియు వార్డు సభ్యులను సోమవారం ప్రమాణస్వీకారం చేయించినట్లు ఆ గ్రామ ప్రత్యేక అధికారి పద్మ తెలిపారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం మీ వెంట ఉండి మీ సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు సాగుతున్న అని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మరియు ప్రజలు పాల్గొన్నారు
- Advertisement -



