- Advertisement -
నవతెలంగాణ-బోడుప్పల్: స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని సోమవారం బోడుప్పల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఆయన చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు.కార్యక్రమంలో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విశ్వం గుప్త, మాజీ కార్పొరేటర్లు దానగళ్ల యాదగిరి, సుమన్ నాయక్, చీరాల నర్సింహా, శ్రీధర్ గౌడ్, నత్తి మైసయ్య తదితరులు పాల్గొన్నారు. నేతలు పాపన్న గారి త్యాగ స్ఫూర్తితో కొత్త తరాలు దేశ భక్తి భావనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
- Advertisement -