Monday, June 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుస‌ర్ఫ‌రాజ్ ఖాన్ విధ్వంస‌క శ‌త‌కం

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ విధ్వంస‌క శ‌త‌కం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు సన్నాహ‌క పోరులో భార‌త ప్ర‌ధాన పేస‌ర్ బుమ్రా దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. అయితే.. టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు మాత్రం దంచేశారు. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్, కేఎల్ రాహుల్ అర్ధ శ‌తకాలతో ఫామ్ చాటుకున్నారు. ఇండియా ఏ కు ఆడుతున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్ విధ్వంస‌క శ‌త‌కంతో మెరిశాడు. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేయ‌లేద‌న్న క‌సితో కాబోలు మెరుపు సెంచ‌రీ బాదాడు. 76 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడీ చిచ్చ‌ర‌పిడుగు. దాంతో ఇండియా ఏ రెండో రోజు ఆట ముగిసే స‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 299 ప‌రుగులు చేసింది. అయితే.. ప్ర‌ధాన జ‌ట్టు కంటే 160 ప‌రుగుల వెన‌క‌బ‌డే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -