- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని జగదాంబ తండాలో బోరు మోటర్ స్థానిక సర్పంచ్ గంగావత్ లతా బాయ్ నంద, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని, త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి తాండ పరిధిలో మూడు బోర్లను త్రవ్వి, మోటార్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పాలకవర్గానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పూర్ణ రాజు నాయక్, పాలకవర్గ సభ్యులు, ఇంచార్జ్ సెక్రటరీ సాగర్, తాండవాసులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



