- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని గొల్లపల్లిలో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ కిషన్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి పనులను, అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకొని లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో ధర్మారెడ్డి, ఉప సర్పంచ్ మధు, పాలకవర్గ సభ్యులు మంజుల, ప్రభాకర్, రెడ్డి మల్లేష్, పంచాయతీ కార్యదర్శి జనార్ధన్, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



