- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామపంచాయతీలో ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి మేకల రామ నర్సయ్య సర్పంచిగా విజయం సాధించారు. ఈ క్రమంలో ప్రత్యర్థి రామ నర్సయ్య కారును అడ్డుకొని అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో సర్పంచ్ కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తనను హత్య చేసేందుకు కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారని సర్పంచ్ ఆరోపించారు.
- Advertisement -


