- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శశికళ కొత్త పార్టీని స్థాపించారు. రామనాథపురం జిల్లా కముదిలో జరిగిన జయలలిత జయంతి వేడుకల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండాలో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలను పొందుపరిచారు. జయలలిత మరణం తర్వాత అనేక సమస్యలు ఎదురయ్యాయని, తాను సీఎంగా నియమించిన వ్యక్తి వెన్నుపోటు పొడిచారని శశికళ వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్ల మౌనం ఇక కొనసాగదని స్పష్టం చేశారు.
- Advertisement -



