– ప్రి క్వార్టర్స్లో ఓడిన సింధు, ప్రణరు
సింగపూర్: సింగపూర్ ఓపెనర్ సూపర్-750లో పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్లో భారత షట్లర్ల పోరాటం ముగియగా.. గురువారం జరిగిన పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జంట ఏడోసీడ్ ద్వయాన్ని మట్టికరిపించి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండోనేషియా షట్లర్లు సబర్ కర్యమన్ గుటమ, మొV్ా రెజా పహ్లెవీ జోడీని భారత జంట 19-21తో తొలి గేమ్ను కోల్పోయినా.. ఆ తర్వాత రెండు గేమ్లను 21-16, 21-19తో గెలుపొంది క్వార్టర్స్కు దూసుకెళ్లింది. ఈ గేమ్ సుమారు గంట 14 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘంగా సాగింది. క్వార్టర్ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట మలేషియా జంటతో తలపడనున్నారు. ఇక మహిళల సింగిల్స్లో పివి సింధు 9-21, 21-18, 16-21తో వై.ఎఫ్. చెన్(చైనా) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్ చేజార్చుకున్న సింధు.. రెండో గేమ్లో పోరాడి విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో, చివరి గేమ్లో చివరి పాయింట్వరకు పోరాడినా.. చైనా షట్లర్ ముందు రాణించలేకపోయింది. ఇక హెచ్ఎస్ ప్రణరు ఫ్రాన్స్కు చెందిన క్రిస్టో పపోవ్ చేతిలో 16-21, 14-21తో పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్లో త్రీసా జాలీ, గాయత్రి గోపిచంద్ ద్వయం 8-21, 10-21తో చైనా షట్లర్ల చేతిలో, సింగ్ సొనాలీ-ప్రముధేశ్ జంట 21-23, 7-21తో ఆస్ట్రేలియా జంట చేతిలో ఓటమిపాలయ్యారు.
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్
- Advertisement -
- Advertisement -