- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల ఎంపీడీవోగా శనివారం సత్యపాల్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఊరుకొండ ఎంపీడీవో గా గతంలో విధులు నిర్వహించిన కృష్ణయ్య బదిలీపై వెల్దండ మండలానికి వెళ్లగా.. వెల్దండ మండలంలో ఎంపీడీవో గ పనిచేసిన సత్యపాల్ రెడ్డి ఊరుకొండ ఎంపీడీవో గా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊరుకొండ మడల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, మండల ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములై తమకు సహకరించాలని కోరారు.
- Advertisement -



