– స్కేటింగ్లో బంగారు పతకం సాధించిన తన కుమారుడు ఆయుష్ సేన రెడ్డికి మెడల్ బహూకరిస్తున్న శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డి
హైదరాబాద్: వేసవి శిక్షణ శిబిరాలు భావి చాంపియన్లకు బాటలు వేసిందని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ కే. శివసేనా రెడ్డి అన్నారు. 45 రోజుల పాటు 30కి పైగా క్రీడాంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్లు గురువారం ముగిశాయి. గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ సహా పలు స్టేడియాల్లో జరిగిన ముగింపు వేడుకలకు శాట్జ్ చైర్మెన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ చాటిన అథ్లెట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ‘సమ్మర్ క్యాంప్స్కు విశేష ఆదరణ లభించింది. భావి చాంపియన్లకు ఈ శిక్షణ శిబిరాలు బాటలు వేశాయి. గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో సమ్మర్ క్యాంప్స్కు ఆదరణ లభించింది. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన కల్పించేందుకు యోగా, జుంబా డ్యాన్స్ సెషన్లు ఏర్పాటు చేశాం. వ్యసనాలకు బానిసలు కాకుండా, యువత క్రీడలపై దృష్టి పెట్టాలని’ శివసేనా రెడ్డి అన్నారు.
ముగిసిన శాట్జ్ సమ్మర్ క్యాంప్లు
- Advertisement -
- Advertisement -