- Advertisement -
న్యూఢిల్లీ : ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీదారు ఎస్బీఐ కార్డ్, ఫోన్పే భాగస్వామ్యంతో బుధవారం ఫోన్పే ఎస్బీఐ కార్డును విడుదల చేసింది. రెండు వేరియంట్లలో పర్పుల్, సెలెక్ట్ బ్లాక్లో లభ్యమయ్యే ఈ కాంటాక్ట్లెస్ కార్డ్లు రూపే, వీసా నెట్వర్క్లపై అందుబాటులో ఉంటాయని తెలిపింది. వీటితో ఫోన్పే యాప్ లావాదేవీలపై గరిష్టంగా 10 శాతం, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై 5 శాతం రివార్డ్ పాయింట్లను పొందవచ్చని ఎస్బీఐ కార్డ్ సీఈఓ సలీల్ పాండే పేర్కొన్నారు. ఈ కార్డ్ డిజిటల్ చెల్లింపులను సరళీకరిస్తూ, వినియో గదారుల ఆర్థిక ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఫోన్ పే సీఈఓ సమీర్ నిగం తెలిపారు.
- Advertisement -