- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీకి ఉత్తరప్రదేశ్ మావు జిల్లా కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో దోషిగా తేలిన అబ్బాస్ అన్సారీ సన్నిహితుడు మన్సూర్ అన్సారీకి కూడా కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది.విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులలో ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ, అతడి సన్నిహితుడు మన్సూర్ అన్సారీలను ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఉదయం దోషులుగా తేల్చింది. అనంతరం అబ్బాస్ అన్సారీకి రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మన్సూర్ అన్సారీకి ఆరు నెలల జైలుశిక్ష విధించింది.
- Advertisement -