Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్కాలర్‌ షిప్పుల మంజూరు గడువు పొడిగింపు

స్కాలర్‌ షిప్పుల మంజూరు గడువు పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
2024-25 సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం రాష్ట్రంలోని కళాశాలలు, విద్యార్థుల ఇ-పాస్‌ వెబ్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ నెల 31 నుంచి వచ్చే నెల 30 వరకు పొడిగించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల పథకం కింద రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతి, ఆర్థికంగా వెనుకబడిన తరగతి , మైనారిటీలు, శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే స్కాలర్‌షిప్‌లను అందిస్తుందని తెలిపారు. పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల మంజూరు, పంపిణీలో మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి, వెబ్‌సైట్‌:ttp://telanganaepass.cgg.gov.in (E-PASS PORTAL) అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కింద తాజా పునరుద్ధరణ స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం డేటాను ప్రారంభించడానికి, ప్రాసెస్‌ చేయడానికి ఈ వ్యవస్థకు కళాశాలలు, విద్యార్థుల నమోదు అవసరమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -