- Advertisement -
నవతెలంగాణ-యాదాద్రి: మోత్కూరు మున్సిపల్ కేంద్రం పాత ఆరెగూడెం రూట్ లో సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్ళగా దానిలో సుమారుగా 25 నుంచి 35 మంది విద్యార్థులు ఉన్నారు. వారిని ఎగ్జిట్ డోర్ నుంచి కిందకు సురక్షితంగా కిందకు దింపారు స్థానికులు. హుటా హుటిన ప్రిన్సిపల్ మరియన్న ఘటన స్థలానికి చేరుకొని పిల్లలని మరొక స్కూల్ బస్సు లో గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -