Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటాపూర్ లో ప్రారంభమైన బడిబాట  ..

కాటాపూర్ లో ప్రారంభమైన బడిబాట  ..

- Advertisement -

ప్రధానోపాధ్యాయులు బి సుధాకర్ 
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు బానాల సుధాకర్ ఆధ్వర్యంలో “బడిబాట” కార్యక్రమం నిర్వహించారు. మొదట పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు గ్రామస్థాయి ఉద్యోగులతో “గ్రామసభ” నిర్వహించారు. పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో “బడిబాట” గురించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల హెచ్ఎం బానాల సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని అన్నారు. గత సంవత్సరం చదివిన పదో తరగతి విద్యార్థులు మండల స్థాయిలో మొదటి స్థానం సాధించి, వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించామని తెలిపారు. కాటాపూర్, పరిసర గ్రామాలలో విద్యార్థులు కాటాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అడ్మిషన్లు పొందాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని, ఉచిత పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన, యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం, అటల్ టింకరింగ్, ల్యాబ్ అత్యధికమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష సూక్ష్మ పరిశీలన జ్ఞానం పెరుగుతుందని, ఆటల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే బదులు, ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపించాలని తల్లిదండ్రులను, విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సక్రు నాయక్, కోడూరి సమ్మయ్య, సుతారి పాపారావు విజయ శ్రీదేవి జీవన్ లాల్, మాజీ సర్పంచులు పుల్లూరి గౌరమ్మ, లంజపెల్లి నర్సయ్య, పేరెంట్స్ గండు బిక్షపతి, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -