Saturday, June 14, 2025
E-PAPER
HomeNewsఉత్సాహంగా పాఠశాలల పున:ప్రారంభం

ఉత్సాహంగా పాఠశాలల పున:ప్రారంభం

- Advertisement -

– తొలిరోజే 54 లక్షల పాఠ్యపుస్తకాల పంపిణీ
– 20 లక్షల యూనిఫారాలు అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పాఠశాలలు గురువారం నూతనోత్సాహంతో పున:ప్రారంభమయ్యా యి. పాఠశాలలు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం పాఠశాలలు తెరిచే నాటికి పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫారాలు చేరేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఆ లక్ష్యం నెరవేరింది. పాఠశాలలు తెరిచే నాటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,852 ప్రభుత్వ, ఎయిడెడ్‌, గురుకుల పాఠశాలలకు 1,01,66,220 పాఠ్యపుస్తకాలు చేరాయి. ఇందులో తొలిరోజు పాఠశాలలకు హాజరైన సుమారు 8,33,398 లక్షల మంది విద్యార్థులకు 54,52,708 పుస్తకాలను ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అందజేశారు. ఈ ఏడాది మొత్తం 20,30,667 మంది విద్యార్థులకు యూనిఫారాలను అందజేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రోజు పాఠశాలలకు హాజరైన 8,33,398 విద్యార్థులకు ఒక జత యూనిఫారాలను ఉపాధ్యాయులు అందజేశారు. రెండో జతను సాధ్యమైనంత త్వరలో అందజేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది నుంచి పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కృత్రిమ మేథ (ఏఐ)ని ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తుండడంతో ఆ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేయనున్నారు. గతేడాదే సమారు 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం, 21,419 మంది టీచర్లకు పదోన్నతులు ఇవ్వడం, 34,700 మందికి బదిలీలు పూర్తి చేయడంతో ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల నమోదు, బోధనపై దృష్టిసారించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల నేతృత్వ ంలోనే గతేడాది అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం పూర్తి చేసింది. పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ, ఇతర కార్యకలాపాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు రోజువారీ సమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -