- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోర్టులు, నౌకలు, టర్మినల్స్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. పోర్టులు, నౌకలు, టర్మినల్స్లో సెకండ్ లెవెల్ భద్రతను పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.
- Advertisement -