- Advertisement -
- – ప్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలిసులు
నవతెలంగాణ -ముధోల్: ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో సోమవారం జరిగిన ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ముధోల్ సిఐ మల్లేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పోలిసులు గ్రామప్రజలకు భద్రత పై భరోసా నింపడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలో ఆయా వీధుల గుండా బారీ సంఖ్యలో పోలిసులు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణ కు తాము ఉన్నామని పోలిసులు ఫ్లాగ్ మార్చ్ ద్వారా తేలియజేశారు.ఈకార్యక్రమంలో ముధోల్ ఎస్ఐ సంజీవ్, ఆయా మండలాల ఎస్సైలు, పోలిసులు, శివంగి టీం పోలిసులు పాల్గొన్నారు.
- Advertisement -