- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జూన్ 12న అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారి భద్రతను కేంద్రం తాజాగా పెంచింది. దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్న ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ జీవీజీ యుగందర్ కు ‘ఎక్స్’ కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. బ్యూరో చీఫ్కు ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -