- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
ఛతిష్ గఢ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా పశువులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు కాటారం పోలీసులు మకాం వేసి బుధవారం పట్టుకున్నారు. కాటారం ఎస్ఐ అభినవ్ తెలిసిన పూర్తి కథనం ప్రకారం కాటారం పత్తిమిల్లు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో డిసిఎం వ్యాన్లో కంటేనర్లో తరలిస్తున్న 30 పశువులను పట్టుకొని రానాపూర్ గోశాలకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెనర్ ఎస్ఐ గీతా,పశువుల వైద్యాధికారి దిరజ్, హెడ్ కానిస్టేబుల్ రామయ్య,పశువైద్యశాల అటెండర్ అక్రమ్ పాల్గొన్నారు.
- Advertisement -