- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్యానా గురుగ్రామ్లోని సిధ్రావాలి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. సిగ్నేచర్ గ్లోబల్ సొసైటీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది శిథిలాల కింద చిక్కుకోగా, క్షతగాత్రులను గాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురిని గుర్తించామని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
- Advertisement -



