Wednesday, June 18, 2025
E-PAPER
Homeజాతీయంఅమ్మకానికి ప్రభుత్వరంగ బ్యాంకుల వాటాలు..!

అమ్మకానికి ప్రభుత్వరంగ బ్యాంకుల వాటాలు..!

- Advertisement -

ఐదింటిలో వాటాల ఉపసంహరణ
– జాబితాలో సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర
న్యూఢిల్లీ:
ప్రజల నుంచి తీవ్ర నిరసనల నేపథ్యంలో రెండేండ్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాల వేగాన్ని తగ్గించిన మోడీ సర్కార్‌.. మళ్లీ అదే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ (పీఎస్బీ)ల్లోని వాటాలను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టడానికి మళ్లీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఐదు కీలక బ్యాంక్‌ల్లోని వాటాలను విక్రయించే పనిలో ఉందని సమాచారం. ఈ జాబితాలో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సీబీఐ), యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం), పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ విత్త సంస్థలున్నాయి. రాబోయే ఆరు నెలల్లో ఈ ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 20 శాతం వరకు వాటాలను విక్రయించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని రిపోర్టులు వస్తోన్నాయి. మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేస్తోందని సిఎన్‌బిసి అవాజ్‌ ఓ కథనంలో వెల్లడించింది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ), ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గాల ద్వారా పిఎస్‌బిల్లో వాటాలను విక్రయించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎస్‌బీల్లో వాటాల విక్రయం వార్తలతో మంగళవారం ఐఓబీ షేర్‌ 0.99 శాతం పెరగ్గా.. సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్‌ 2.6 శాతం, యూకో బ్యాంక్‌ 0.16 శాతం, బీఓఎం షేర్‌ 0.59 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ షేర్‌ 3.4 శాతం పెరిగింది. పీఎస్బీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకో వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నామనే ఆలోచనతో దేశానికి వెన్నెముక లాంటి ఆయా బ్యాంక్‌ల్లో వాటాల విక్రయించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -