నవతెలంగాణ-హైదరాబాద్: కొలంబియా ప్రభుత్వతీరుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరుల పట్ల కనీస సానుభూతి వ్యక్తం చేయకపోగా.. భారత్ దాడుల తర్వాత పాక్లో చనిపోయినవారికి మాత్రమే సంతాపం తెలిపిన కొలంబియా ప్రభుత్వ వైఖరి తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్కు దారితీసిన పరిస్థితులు, భారత్ తీసుకున్న చర్యలను కొలంబియా అధికారులకు వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శశిథరూర్ స్పష్టం చేశారు. పాక్ పై దౌత్య యుద్దానికి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. భారత పార్లమెంట్ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా థరూర్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పలు దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తుందన్నారు. సింధు జలాల ఆదేశానికి నిలిపివేయడం సరైన నిర్ణయమని కొనియాడారు
కొలంబియా ప్రభుత్వతీరుపై శశిథరూర్ అసంతృప్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES