నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రీల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 22మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో దౌత్యపరంగా పాక్ పై పలు విధించింది. ఈక్రమంలో 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ప్రభత్వుం నిలిపివేసింది. పాకిస్థాన్ దేశానికి ఆ నది జలాల నీటిని కూడా నిలిపివేసింది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ చేపట్టి..ఆదేశంలోని ఉగ్రశిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత పాక్ అభ్యర్థన మేరకు భారత్ ఆపరేషన్ సిందూర్కు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ వాయుసేనల చేతిలో చావు దెబ్బ తిన్న ఆదేశ నేతలకు బుద్దిరావడంలేదు. తాజాగా పాక్ రక్షణ మంత్రి మరోమారు అధిక ప్రేలాపనకు దిగారు.
ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ మాట్లాడుతూ సిమ్లా ఒప్పందానికి ఇక విలువలేదు.. అదొక డెడ్ డాక్యుమెంట్ అని వ్యాఖ్యానించారు. సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారో లేదో తెలియదు గానీ.. సిమ్లా అగ్రిమెంట్ పనైపోయిందని ఆ దేశానికి చెందిన ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్కు వెల్లడించారు.
1971లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందానికి పునాది పడింది. ఈ యుద్ధం జరిగిన దాదాపు 16 నెలల తర్వాత, జూలై 2, 1972న, అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం జరిగింది. భారత్-పాక్ పరస్పర అంగీకారంతో కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC)ని గుర్తిస్తాయి. ఏ పార్టీ కూడా దానిని ఏకపక్షంగా మార్చవు. రెండు దేశాలు ఒకదానికొకటి బలప్రయోగం, యుద్ధం లేదా తప్పుదారి పట్టించే ప్రచారాన్ని ఆశ్రయించకూడదని కూడా నిర్ణయించుకున్నాయి. శాంతిని కాపాడుతాం. సత్ససంబంధాలను మెరుగుపరుస్తామని ఇరు దేశాలకు చెందిన అగ్రనేతలు సంతకాలు చేశారు.