- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని కొలనులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా విగ్రహం భక్తుల మీద పడింది. నిమజ్జనం కోసం క్రేన్తో విగ్రహాన్ని ఎత్తి దింపుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతో భారీ వినాయక విగ్రహం దాని కింద ఉన్న భక్తుల మీదకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే గాయపడిన ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
- Advertisement -