- Advertisement -
నవతెలంగాణ – వాషింగ్టన్: అమెరికా వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. లాస్ ఏంజెలెస్తోపాటు నార్త్ కరోలినాలో దుండగులు కాల్పులకు పాల్పడగా, కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనల్లో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. నార్త్ కరోలినాలోని హికోరిలో ఓ ప్రయివేట్ ప్రాపర్టీలో జరిగిన కాల్పల్లో ఒకరు మృతిచెందగా, 11 మంది గాయపడ్డారు. అదేవిధంగా లాస్ ఏంజెలెస్ నగరంలోని బాల్డివన్ పార్క్లో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి మరణించాడు. మరొకరు గాయపడ్డారు. అనంతరం అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు.
- Advertisement -