No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeవరంగల్ట్రాన్స్ పార్మర్, విద్యుత్ తీగలు మరమ్మతులు చేయరా.!

ట్రాన్స్ పార్మర్, విద్యుత్ తీగలు మరమ్మతులు చేయరా.!

- Advertisement -

పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాధిత రైతులు
నవతెలంగాణ – మల్హర్ రావు: గత మే నెలలో ఈదురు గాలివాన బీభత్సం సృష్టించడంతో మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలో అరేవాగు ప్రక్కన లంబడికుంట దగ్గర ట్రాన్స్ పార్మర్లు,విద్యుత్ తీగలు తెగిపడ్డాయని,మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాలా శశిధర్ రావు, పారిపెళ్లి వీరారెడ్డి,తాళ్ల రాజేందర్ మంగళవారం వాపోయారు. అసలే ఖరీప్ సీజన్ ప్రారంభం కావడంతో పొలాలు నాట్లు వేసేందుకు సిద్ధంగా నార్లు పెరిగాయని,విరిగిన ట్రాన్స్ పార్మర్లు,విద్యుత్ పొల్లు,తీగలు మరమ్మతులు చేయాలని అధికారులకు చెప్పిన నిమ్మకు నిరెత్తనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గాలి బీభత్సంతో నెల క్రితం దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంలో అంతర్యమేమిటో చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోని ట్రాన్స్ పార్మర్లు,తీగలు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad