- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్: నిజామాబాద్ నగరంలో ఓ వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల ఎస్సై తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద శనివారం మధ్యాహ్నం సమయంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనదారుడిని అడ్డుకోగా అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బైకు వెనుక హ్యాండిల్ను పట్టుకోబోయాడు. ఈ క్రమంలో వాహనదారుడు వేగం పెంచడంతో ట్రాఫిక్ ఎస్సై రహమతుల్లా కిందపడిపోయారు. దీంతో ఆయన చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
- Advertisement -