Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంజ‌మ్మూలో ఎస్ఐఏ ఆక‌స్మీక త‌నిఖీలు

జ‌మ్మూలో ఎస్ఐఏ ఆక‌స్మీక త‌నిఖీలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆప‌రేష‌న్ సింధూర్ ముగిసిన త‌ర్వాత ప‌లు వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో భార‌త్ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సెర్చ్ ఆప‌రేష‌న్ ముమ్మ‌రం చేశాయి. స్టేట్ ఇన్వెస్ట‌గేష‌న్ ఏజెన్సీ(ఎస్ఐఏ) అధికారులు ద‌క్ష‌ణ‌ జ‌మ్మూలోని ప‌లు ప్రాంతాల్లో ఆక‌స్మీక త‌నిఖీలు చేప‌ట్టారు. మొత్తం 20 ప్రాంతాల్లో ఎస్ఐఏ అధికారులు బృందాలుగా విడిపోయి..ప‌లు ఇండ్ల‌లో సోదాలు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ప‌లువురిని అదుపులోకి తీసుకున్నారు. స్లీప‌ర్ సెల్స్ ఏర్పాటు చేసి భార‌త్ బ‌ల‌గాలు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల గురించి పాకిస్థాన్ కు స‌మాచారం చేర‌వేస్తున్నార‌ని అధికారులు చెప్పారు. వాట్సాప్ టెలిగ్రామ్, సిగ్న‌ల్స్ ద్వారా పాక్ కేంద్రంగా ప‌నిచేస్తున్న‌ ల‌ష్క‌ర్ తోయిబ్, జైషే మ‌హ్మ‌ద్ తీవ్ర‌వాద సంస్థ‌ల‌కు స‌మాచారాన్ని పంపిస్తున్నార‌ని అధికారులు చెప్పారు. అంతేకాకుండా భార‌త్ వ్య‌తిరేకంగా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, అవాస్తవ‌లు ప్ర‌చారం చేసి అల్ల‌ర్ల సృష్టించ‌డానికి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -