Wednesday, June 4, 2025
E-PAPER
Homeజాతీయంఅస్సాంలో సిల్చార్ సిటీ జల దిగ్భందం

అస్సాంలో సిల్చార్ సిటీ జల దిగ్భందం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈశాన్య రాష్ట్రాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచుస్తున్నాయి. ఒక వైపు కొండచరియలు విరిగి పడుతుండటం.. మరోవైపు వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. కొండచరియలు విరిగిపడుతుండటంతో గ్రామాలు గ్రామాలే మునిగిపోయే పరిస్థతి ఏర్పడింది. అస్సాం, సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండ చరియలు విరిగి పడుతుండటంతో రవాణా మార్గాలు దెబ్బతిన్నాయి. కొండలు కూలి పెద్ద పెద్ద బండరాళ్లు గ్రామాలపై పడుతుండటంతో ఊహించని ప్రమాదాలు జరుగుతున్నాయి.

అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు విరిగి పడటంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వరదలతో సిల్చార్ సిటీ జలమయమైనట్లు తెలిపారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలోని ప‌లు నదులు పొంగి పొర్లుతుండటంతో పరివాహక ప్రాంతాలన్నీ కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈశాన్య రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు లక్షా 44 వేల ఇండ్లు ధ్వంసమైనట్లు అస్సాం డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -