రాళ్లు సంగీతం పలకటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. కాదు ఇందులో కల్పితము ఏమీ లేదు. సష్టించినది లేదు. మీరు వింటున్నది నిజమే. ఒక సంగీత విధ్వాంసుడు వీణ వాయిస్తే సప్తద్వనులు వస్తాయో ఒక రాయిని మరొక రాయితో తాడనం చేసినట్లయితే ఏ విధంగా శబ్దం వస్తుందో అలాగే వివిధ రాళ్ల మీద వచ్చే శబ్దాలు సంగీతాన్ని తలపింపచేస్తున్నాయి. కోయిలకు రాగాలు పాడాలనిపిస్తుంది. జింకలకు గంతులు వేయాలనిపిస్తుంది. అంత వినసొంపుగా, మ్యూజికల్ సౌండ్ వచ్చే రాళ్లు ఉన్నాయి. ఇలాంటి రాళ్లు భూ విజ్ఞాన శాస్త్రం ప్రకారం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించి ఉండొచ్చు. ఈ శబ్దాలను గమనించిన పూర్వికులు, ఈ రాళ్లలో ఉన్న ప్రత్యేకతను గమనించి అనేక రకాలుగా… దేవాలయాల్లో గంటలకు, కొన్ని దేవస్థానాల్లో స్తూపాలకు, విగ్రహాలకు వాడేవారు. అయినా అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందని చందంగా ప్రస్తుతం ఈ రాళ్ల పరిస్థితి ఉంది.
మొద్దురాళ్ళను చెక్కి బొమ్మగా తయారుచేసి పూజిస్తున్న ఈ రోజుల్లో. సహజ సిద్ధంగా సంగీత ధ్వనులు వినిపిస్తున్న ఈ రాళ్ల వైపు చూడకపోవడం ఏమిటని ప్రశ్న వస్తుంది వీటిని చూస్తే. ఇలాంటి రాళ్లను సమాజానికి చూయించకపోతే మరుగున పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాళ్లు గొప్ప చరిత్ర కలిగినవి. ఒక్కొక్కరాయిని కొడితే పలు రకాల ధ్వనులను వినిపిస్తాయి. రాళ్లు రాగాలు పలకటం ఎప్పుడైనా చూశారా. సహజ సిద్ధంగా ధ్వనులు పలకాలంటే కంచు, ఇనుము, ఇత్తడి, రాగి, వీటికి మాత్రమే ధ్వనులు సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ మాత్రం వీటికి విరుద్ధంగా రాళ్లు పలు రకాల ధ్వనులు వినిపిస్తున్నాయి. రాళ్ళల్లో మూలకాలు, లోహాల కలయిక వల్ల ఈ శబ్దాలు వస్తాయని జియానిస్టులు చెబుతున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన ఏనే గుండ్లల్లో రాళ్లను కొడితే స్వప్న రాగాల ధ్వనులు వినిపిస్తున్నాయి. రాళ్లు వచ్చే శబ్దాలు కొంతమంది చూసినప్పటికీ ఎక్కువ మందికి తెలవని విషయం. ఈ రాళ్లు భారతదేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్… ఇలా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయని ప్రచారంలో ఉన్నది. ఈ విషయం తెలుసుకోవాలంటే తెహ నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటి పాముల గ్రామాని వెళ్లాల్సిందే.
నేషనల్ హైవే 65 కు ఆనుకుని కూతవేటు దూరంలో రాగాలు పలికే రాళ్లు ఉన్నాయి. కానీ వీటికి ఆదరణ కరువైంది. ఈ రాళ్లు కొన్ని వందల సంవత్సరాల కాలం నాటివి.ó ప్రకతికి భిన్నంగా ఏ వస్తువైనా మంచి ఆదరణ ఉండే ఈ రోజులలో ఈ రాళ్లను మాత్రం ప్రభుత్వం, పురావస్తు శాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఈ రాళ్ల చరిత్ర ఏందో తెలుసుకుందాం. ఈ ఏనే గుట్ట రాళ్ళను ఈ ప్రాంతంలో నగర అని పూర్వకాలం నుండి పిలవబడుతుంది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా శబ్దాలు వినిపించడం ఈ రాళ్లకున్న ప్రత్యేకత. సంగీత ధ్వనులు వినిపించడం ఈ గుట్ట సొంతం. ఈ రాళ్లు కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నాయని మా పూర్వీకులు చెప్పారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడిన రజాకారుల కాలంలోవా, లేక ఎవరైనా ఇక్కడికి తెచ్చారా అనే సందేహాలు ఉన్నాయి. కానీ మనం గమనిస్తే ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవేనని గుర్తించవచ్చు. ఆ కాలంలో శబ్ద కాలుష్యం తక్కువ ఉండేది. నగరా అనే పిలవబడే ఏనేపై ఈ ప్రాంతంలో శత్రువులు గ్రామాలపై దండయాత్ర చేసేటప్పుడు రాళ్లను రాళ్లతో కొట్టినప్పుడు వచ్చే సప్త స్వరాలతో ధ్వనులతో ప్రజల అప్రమత్తం అయ్యే వారని చరిత్ర ఉన్నది. అప్పుడు ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన ప్రాంతం. రజాకారులు గ్రామాలపై దండయాత్ర చేసే సమయంలో నగారగుట్టపై ఒక మనిషి ఉండి గెరిల్లా దళాలను గమనిస్తూ గ్రామాలపై విచ్చుకుపడే సమయంలో ఈ రాళ్లను కొట్టడంతో వచ్చే స్వప్త ధ్వనులు శబ్దాలతో ప్రజలు అప్రమత్తమై రజాకారులను ఎదుర్కొనే వారని తమ పూర్వీకులు చెప్పారని ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు.. ఈ రాళ్లను గమనిస్తే పూర్తిగా గుంటలమయంతో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివద్ధి చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఇంత చరిత్ర కలిగిన రాళ్లను చరిత్ర పుటల్లో నిలపాలని కోరుతున్నారు.
– గడగోజు రవీంద్ర చారి, 9848772232
రాగాలు పలికే రాళ్లు
- Advertisement -
- Advertisement -