నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించ నున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రలు పోషించారు. బుధవారం ఈ చిత్ర టీజర్ని మేకర్స్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ,’కూతురు కోసం సినిమా చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ నాకు తెలుసు. ఈ జర్నీనే ఒక సినిమాగా తీయవచ్చు. అర్జున్ కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ‘ఓం, ఏ, ఉపేంద్ర’ ఇలాంటి కల్ట్ సినిమాలు తీసిన ఉపేంద్రకి థ్యాంక్స్. ఈ రోజు నా స్క్రీన్ ప్లే ఇలా ఉందంటే కారణం ఆ మూడు సినిమాలే. ఇందులో ఒక పాట విన్నాను. చాలా నచ్చింది. ఆ పాట వినగానే అది చంద్రబోస్ రాసిన పాటే అని నాకు తెలిసిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ ఇందులో మంచి మ్యూజిక్ చేశారు. నిరంజన్, ఐశ్వర్య టీజర్లో చాలా బ్యూటీఫుల్గా కనిపించారు. సాంగ్స్, ఫైట్స్ చాలా బాగున్నాయి’ అని తెలిపారు.
‘మా అమ్మాయి కోసం ఈ సినిమాని మొదలు పెట్టాను .తన టాలెంట్, హార్డ్ వర్క్ చూసి ఒక మంచి సినిమా తీయాలని స్టార్ట్ చేశాను. జనాలకి ఈ సినిమా నచ్చుతుందని నమ్మకం ఉంది’ అని అర్జున్ సర్జా చెప్పారు.
హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ, ‘ఇది నా ఫస్ట్ ఫిలిం. నాన్నతో కలిసి ఈ సినిమా చేయటం, నటించడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
వినూత్న కాన్సెప్ట్తో ‘సీతా పయనం’
- Advertisement -
- Advertisement -