- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చేశారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో జరగాలన్నా కాంగ్రెస్ నేతలు కమీషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. రహమత్నగర్లో పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయి. బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. అక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. ఔషధాలు కూడా ఉండటం లేదు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లే కూలుస్తున్నారు.. పెద్దలవి కూల్చడం లేదు’’ అని హరీశ్రావు అన్నారు.
- Advertisement -