– వచ్చే నెల చివరినాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేటి నుంచి రాష్ట్రంలోని మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్కు వచ్చే కొనుగోలు, అమ్మకందార్లు గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించవలసిన పరిస్థితిని మార్చుతూ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలను ఆధునికీకరించడమే కాక, స్లాట్ బుకింగ్ విధానాన్ని దశలవారీగా అమలులోకి తీసుకొస్తున్నా మని చెప్పారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేశామనీ, అక్కడ విజయవంతం కావడంతో రెండవ విడతలో మరో 25 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నామని ప్రకటించారు.
వచ్చే నెల చివరినాటికి రాష్ట్రంలోని 144 సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావ డానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సిబ్బందిని నియమిస్తామనీ, ఇప్పటికే ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు నియమించడం జరిగిందని తెలిపారు. అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని విలీనం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట, సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధి విలీనం విజయవంతం కావడంతో షాద్నగర్, ఫారూక్ నగర్ సిద్దిపేట, సిద్దిపేట (రూరల్) కార్యాలయాలను విలీనం చేయడం జరిగిందని వివరించారు.
స్లాట్ బుకింగ్ అమలు కానున్న కార్యాలయాలు
హైదరాబాద్ ఆర్ఓ. ఆర్ఓ సౌత్, నారపల్లి, ఘట్కేసర్, మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, బీబీనగర్, సిద్దిపేట, సిద్దిపేట రూరల్, గజ్వేల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ ఆర్ఓ, జనగాం, ఘన్పూర్, నర్సంపేట, కల్వకుర్తి, నారాయణపేట, మహేశ్వరం, రంగారెడ్డి ఆర్ఓ. ఆఫీసు, షాద్నగర్, ఫరూక్ నగర్, వనస్థలిపురం, శేరిలింగంపల్లి.
మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES