Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అప్పుల బాధతో చిరు వ్యాపారి ఆత్మహత్య 

అప్పుల బాధతో చిరు వ్యాపారి ఆత్మహత్య 

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
ఉరేసుకొని చిరు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడారంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కథనం మేరకు.. గత 12 సంవత్సరాల క్రితం పిల్లి సత్యం (50) మేడారం వచ్చి గాజుల వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్నాడు. 10 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మధ్యలో వ్యాపారం నడవక అప్పు తీర్చలేక అనేక ఇబ్బందులు పడ్డాడు. అప్పు తీర్చలేక సోమవారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో గాజుల షాపు వెనుక రేకుల షెడ్డులో ఉరేసుకొని మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి హుటాహుటిన చేరుకొని భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారి కి పెద్ద కొడుకు పిల్లి పవన్, చిన్న కొడుకు అఖిల్ లు ఇద్దరూ బైరాన్ అనే విదేశంలో ఉన్నారు. దీంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad