- Advertisement -
నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని పిప్రి గ్రామానికి వెళ్లే రోడ్డు సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు సోమవారం తహసిల్దార్ శ్రీలత కు వినతిపత్రం అందజేశారు. బైంసా -బాసర జాతీయ రహదారి నుండి పిప్రి గ్రామానికి వెళ్ళే రోడ్డు మధ్యలో చిన్న పాటి వర్షం తో నీళ్ళు నిల్వ ఉంటుంటంతో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని వారు పేర్కొన్నారు. నీల్వ ఉన్న నీటి ని తొలగిస్తే కొంత మంది తమను బెదిరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
- Advertisement -