- Advertisement -
– ఉదర సమస్యలతో నాలుగు రోజులుగా వైద్య సేవలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు ఉదర సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈనెల 15న ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా చికిత్స పొందిన సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడటంతో గురువారం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో డిశ్చార్జి చేసినట్టు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
- Advertisement -