- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. ఈరోజు సాయంత్రం రవీంద్రభారతిలో 50 మందితో సంగీత విభావరిని నిర్వహించనున్నారు.
- Advertisement -



