Saturday, September 20, 2025
E-PAPER
- Advertisement -

Assembly: బీఆర్ఎస్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పై స్పీకరే నిర్ణయం తీసుకుంటారు: మంత్రి శ్రీధర్‌బాబు

నవతెలంగాణ హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం సభలో చర్చ జరుగుతుందన్నారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆదివారం సభలో పెడతామని తెలిపారు. కాళేశ్వరంపై కూడా ఆదివారమే చర్చ చేపడతామని ఆయన చెప్పారు. కాళేశ్వరంపై సభలో బీఆర్ఎస్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కు అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అన్ని అంశాలపై చర్చ చేయాలంటే.. నాలుగైదు రోజుల తర్వాత సభ నడుపుతామని తెలిపారు. గణేష్ నిమజ్జనం, వరదల దృష్ట్యా సభను వాయిదా వేయాల్సి వచ్చిందని శ్రీధర్‌బాబు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -