బాలకష్ణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’ మరోసారి థియేటర్స్లో అలరించడానికి సిద్ధమైంది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్లో ఈనెల 8న థియేటర్స్లో వరల్డ్ వైడ్ గ్రాండ్గా రీ-రిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్లో కొత్త పాట యాడ్ చేశారు. ‘మందేసినోడు’ అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో అన్ స్టాపబుల్ వైబ్తో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్కి చంద్రబోస్ మాస్ని కట్టిపడేసే లిరిక్స్ అందించారు. రీరిలీజ్ ప్రెస్మీట్లో ఈ సాంగ్ని గ్రాండ్గా లాంచ్ చేశారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ,’ఈ సినిమా రీ-రిలీజ్ని లైఫ్లో మర్చిపోలేను. 21 ఏళ్ల తర్వాత ‘లక్ష్మీ నరసింహా’ సినిమాని రీరిలీజ్ చేస్తున్నానంటే నందమూరి అభిమానులకు ఏదో ఒక స్పెషల్, సర్ప్రైజ్ ఇవ్వాలి. ఎలాంటి సర్ప్రైజ్ అని ఆలోచన వచ్చినప్పుడు.. ఈ సినిమా కోసం రెండు సాంగ్స్ చేశాం. ఒక సాంగ్ని షూట్ చేశాం. కానీ సినిమాలో లేదు. ఆ సాంగ్ని ఎలాగైనా రీ-రిలీజ్లో యాడ్ చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్లో నెగిటివ్ దొరికింది. కానీ సౌండ్ దొరక లేదు. ఓన్లీ పిక్చర్ ఉంది. పిక్చర్ ప్రింట్ చేసి చంద్రబోస్కి, డైరెక్టర్కి, భీమ్స్కి పంపించాను. వాయిస్, లిరిక్ రాసి రికార్డు చేయాలని చెప్పాను. చంద్ర బోస్ ఇది ఎలా పాజిబుల్ అన్నారు. చేస్తేనే పాజిబుల్ అవుతుందని చెప్పాను. అయితే ఈ ప్రయత్నాన్ని అద్భుతంగా చేశారు. ఈ పాటని డిస్ట్రిబ్యూటర్స్కి వినిపిస్తే పాట అద్భుతంగా ఉంది అని చెప్పారు. నందమూరి అభిమానులు ఈ సినిమాని మళ్లీ మళ్లీ పెద్ద హిట్ చేయాలని కోరుతున్నాను. బాలయ్య బాబు బర్త్డేకి వస్తుంది. నేనప్పుడు తీసిన దాని కంటే ఇప్పుడు స్క్రీన్ మీద బ్రహ్మాండంగా కనిపిస్తుంది. జయంత్తో మళ్లీ సినిమా చేద్దామని చెప్పాను’ అని తెలిపారు.
సురేష్కి థ్యాంక్యూ. ఇలాంటి కొత్త ఐడియాలన్నీ ఆయకే వస్తాయి. ఆడియో లేని ఈ సాంగ్కి ఏదైనా చేద్దామని ఆయన అన్నప్పుడు నేను ఇంపాజిబుల్ అని చెప్పాను. ఆయన, చంద్రబోస్, భీమ్స్ కలిసి ఈ అద్భుతం చేశారు. ఇళయరాజా ఇలాంటి ఒక ప్రయోగం చేశారని ఎప్పుడో విన్నాను. అయితే అది కూడా ఒక మాంటేజ్ సాంగ్.
కానీ ఒక డాన్స్ బీట్ నెంబర్కి ఇలా చేయడం అనేది వెరీ వేర్. నిజంగా వారికి హ్యాట్సాఫ్. రీ-రిలీజ్లో అందరూ చూసి ఎంజారు చేయండి.
– దర్శకుడు, జయంత్ సి.పరాన్జీ