Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడలు మానసికోలాసానికి దోహదపడతాయి 

క్రీడలు మానసికోలాసానికి దోహదపడతాయి 

- Advertisement -
  • – డ్రగ్స్ రహిత మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా యువత కృషి చేయాలి
    – మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి 
    – వాలీబాల్  క్రీడాకారులకు బహుమతుల ప్రధానం 
    నవతెలంగాణ- తాడ్వాయి 
  • క్రీడలు మానసిక కులాసానికి దోహదపడతాయని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు నిర్మూలనక ప్రతి యువత కృషి చేయాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ సూచించారు. శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడలు ప్రారంభించారు. అందులో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరిస్ మాట్లాడుతూ.. మత్తు మాదకద్రవ్యాల రహిత జిల్లా గా ఏర్పాటు చేయుటకు అందరి సహకారం అవసరమని అన్నారు. ప్రస్తుతం యువత చెడు అలవాట్ల వ్యసనాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు వాడినట్లు తమ దృష్టి కి తీసుక రావాలని, లేదా 1908  టోల్ ఫ్రీ నెంబర్ కు పిర్యాదు చేయాలని సూచించారు.  మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

 రాష్ట్రం సరిహద్దు మార్గం ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున  కటుదిటమైన చర్యలు చేపట్టాలని,గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు,ఎక్కడైనా గంజాయిని  అంతర పంటగా సాగు చేస్తున్నారా అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ,వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించవచ్చని అన్నారు.ఈ దిశగా పోలీస్, ఎక్సైజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి అన్నారు.అనంతరం మండలంలోని 22 యువత వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనగా గెలుపొందిన క్రీడాకారులకు షిల్డ్ లు, అందజేశారు.ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి రవీందర్,పసర సిఐ రవీందర్, ములుగు సీఐ, వంగ శంకర్, ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి, ట్రైనీ ఎస్ఐ మధుకర్, పోలీస్ సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -