- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మృతి చెందనా కుమ్మరి లక్ష్మి అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబానికి గురువారం ఉదయం రూ.5,000/- ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ ప్రతినిధులు మానవతా దృక్పథంతో సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ కప్పెర రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ పాత స్వామి, వార్డ్ మెంబర్లు బెల్ వంశీ, ఎస్ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
- Advertisement -



