- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్తో అయిదు టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో శ్రీలంక బ్యాటింగ్ పూర్తయింది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. ఆ జట్టులో హర్షిత (33), చమరి ఆటపట్టు (31), హాసిని పెరీరా (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2, వైష్ణవి శర్మ 2, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా ఒక్కో వికెట్ తీశారు.
- Advertisement -



