– 1-0తో టెస్టు సిరీస్ కైవసం
కొలంబో: బంగ్లాదేశ్తో రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/56) ఐదు వికెట్ల ప్రదర్శనతో మాయ చేయగా.. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 44.2 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. ధనంజయ డిసిల్వ (2/13), తారిందు రత్ననాయకె (2/19) రాణించారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 458 పరుగుల భారీ స్కోరు చేయగా.. నిశాంక (158), దినేశ్ చండిమాల్ (93), కుశాల్ మెండిస్ (84) రాణించారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకే కుప్పకూలింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్ను 1-0తో శ్రీలంక సొంతం చేసుకుంది. నిశాంక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.
శ్రీలంక ఇన్నింగ్స్ విజయం
- Advertisement -
- Advertisement -